పండువగా హనుమాన్ జయంతి
పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు
సైదాబాద్ / మలక్పేట, ఏప్రిల్ 16: నియోజ వర్గంలో హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వీధులు, ఆలయాలు జై హ నుమాన్.. శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగాయి. స్వచ్ఛందంగా ఆలయాల వద్ద శోభాయాత్రకు బయలుదేరి వెళ్లే భక్తులకు తాగునీరు, మజ్జిగ అందజేశారు. అక్బర్బాగ్, మలక్పేట, సైదాబాద్, ఐఎస్ సదన్, చంపాపేట, సంతోష్నగర్, ధోబీఘాట్ ప్రాంతాలు, మూసారాంబాగ్, పాత మలక్పేట డివిజన్లలో ప్రాంతాల్లో యువకులు కాషాయ జెండాలను చేతపట్టుకుని ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీ నిర్వహించారు.
శోభాయాత్ర ఊరేగింపు సందర్భంగా మలక్పేట ఏసీపీ మంత్రి వెంకటరమణ, ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. దిల్సుఖ్నగర్ మారుతీ మందిర్లో ఈఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో, సలీంనగర్ గణపతి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో అన్నదానం చేశారు.