శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 : జేఈఈ మెయిన్ పరీక్షల్లో గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎర్రంబాటి సాయిరామ్ (99.46) ప్రథమ, ఉటుకూరి వెంకటేశ్ (99.31) ద్వితీయ స్థానంలో నిలిచారు. మొత్తం 100 మంది గురుకుల విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 80 మంది ఐఐటీ అడ్వాన్స్కు అర్హత సాధించారు. వీరిలో 22 మంది విద్యార్థులు 90 శాతం, 40 మంది విద్యార్థులు 80 శాతం, 56 మంది విద్యార్థులు 60 శాతంకు పైగా మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ వట్టికొండ పాపరావు తెలిపారు.