హైదరాబాద్ : హైదరాబాద్లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అమరవీరుల స్థూపాన్ని, పరిసర ప్రాంతాలను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్, ఆర్అండ్ బీకి చెందిన అధికారులతో కలిసి పరిశీలించారు.
ముఖ్యంగా అమరవీరుల స్థూపం(Martyrs Stupam) చుట్టు పక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన ల్యాండ్ స్కేపింగ్ పనులపై అత్యాధునిక శైలిలో ఏర్పాటు చేయాలని సూచించారు. స్థూపం సమీప ప్రాంతాల్లోని ట్రాఫిక్స్ ఐల్యాండ్స్(Traffic Islands) నిర్మాణం, పక్కనే ఉన్న లుంబినీ పార్కు పరిసర ప్రాంతాలను పచ్చచి చెట్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. హుస్సేన్సాగర్ చుట్టూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు.