ఖైరతాబాద్, జూలై 7: ఈ రిక్షాల వినియోగంతో పర్యావరణానికి మేలు జరుగుతున్నదని గ్రీన్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పి.వెంకటేశం గుప్తా తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఈ రిక్షా విశేషాలను మీడియాకు వివరించారు. 2018లోనే ఈ రిక్షాకు రూపకల్పన చేశామని, అయితే ఇదే మోడల్లో దేశంలోని వివిధ కంపెనీలు తయారు చేయగా కొంద రు కోర్టును ఆశ్రయించారని, దీంతో ఈ రిక్షాకు ఇక్కడ అనుమతి నిలిచిపోయిందన్నారు. సాధారణ డీజిల్, పెట్రోల్ ఆటో మాదిరిగానే ఈ రిక్షాలో నలుగురు ప్రయాణించవచ్చని, 4గంటలుచార్జింగ్ చేస్తే 100కిలోమీటర్లుప్రయాణించవచ్చన్నా రు. ఈ వాహనంలో 12వోల్డ్ 100 ఏహెచ్ బ్యాటరీ నాలుగు ఉంటాయన్నారు. కిలోమీటరుకు 5పైసలు మాత్రమే ఖర్చు వస్తుందన్నారు. 500కేజీల నుంచి బరువును మోసుకెళ్లగలదని, వాహనం రివర్స్ కూడా నడుపవచ్చని,సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యూఎస్బీ, మ్యూజిక్ సిస్టం తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఫైర్ ఎస్టింగ్యూషర్ అందుబాటులో ఉంటుందన్నారు. రూ.1.50 లక్షలు విలువ చేసే ఈ వాహనానికి రుణ సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. రోడ్డు రవాణా శాఖ అనుమతినిస్తే తమ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.