DOST | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రూ.200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 25 వరకు ఫస్ట్ ఫేజ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈసారి దోస్త్ యాప్లో సెల్ఫీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థులు మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో దోస్త్ ప్రక్రియను పూర్తిచేస్తారు.