హైదరాబాద్ : ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. కామినేనిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను అంబులెన్స్లో తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు. కామినేని వద్ద ఉదయం 8:04 గంటలకు అంబులెన్స్ బయల్దేరి.. 8:19 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి చేరుకుంది. 17.6 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. పోలీసులను వైద్య సిబ్బంది అభినందించారు.