తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి , తలసాని శ్రీనివాస్యాదవ్
తెలంగాణ శాసనసభలో శనివారం గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.