కాప్రా, జనవరి 16: కాప్రా సర్కిల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగల వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపు కున్నారు. పండుగను పురస్కరించుకొని ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఉదయం వీధుల్లో గంగిరెద్దులతో సందడి చేశా రు. ఉప్పల్, కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్ల పరిధిలో ప్రజలు సంక్రాంతి వేడుక ల్లో భాగంగా గాలిపటాలను ఎగురవేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు గాలిపటాలను ఎగురవేస్తూ, కేరింతలతో నృత్యాలు చేశారు.
కీసర మండలంలో..
కీసర, జనవరి 16: కీసర మండలంలో సంక్రాంతి సంబురాలను ఘనంగా నిర్వహించారు. పండుగ రోజు ప్రతి ఇంటి ముందు మ హిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. మండలంలోని ప్రతి గ్రా మం, వీధుల ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇంకా యువతతో పాటు విద్యార్థులు సహితం గాలి పటాలను పోటాపోటీగా ఎగురవేశారు.
ఘట్కేసర్, పోచారంలలో ..
ఘట్కేసర్, జనవరి 16 : ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లోని ప్రజలు సంక్రాం తి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇండ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు . ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పెట్టి నవ ధాన్యాలు పెట్టి పూజలు చేశారు. యువకులు రాత్రి వరకు పతంగులు ఎగురవేయడంలో బిజిబిజిగా గడిపారు. ఘట్కేసర్, పోచారం చైర్మన్లు పావనీ జంగయ్య యాద వ్, కొండల్రెడ్డిలు మున్సిపాలిటీల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
నాగారం, దమ్మాయిగూడలలో..
మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 16 : నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో సంక్రాం తి, కనుమ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, బండ్లగూడ, కుందన్పల్లి, రాజీవ్గృహకల్ప కాలనీల్లో ప్రజలు ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. యువత ఉత్సహంగా పతంగులను ఎగురవేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో..
మల్కాజిగిరి, జనవరి 16: మల్కాజిగిరి నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సంబురాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా వెంకటాపురంలో ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పతంగులు ఎగురవేస్తూ యువకులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్ర జలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు
నేరేడ్మెట్, జనవరి 16 : నేరేడ్మెట్ డివిజన్ ఆర్కేపురం, అంతయ్యకాలనీలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా అంతయ్యకాలనీలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్ యాదవ్, చాకో, కుట్టి శ్రీనివాస్ యాదవ్, ఇందిర, ఏఆర్ఆర్ సాయి, రఘులు బహుమతులను అందించారు.