మేడ్చల్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ నెల 30న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 30న ఏదులాబాద్, కీసరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. నవంబర్ 2న మరో 10 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
18 వేల ఎకరాలలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అంచానా మేరకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరి మొదటి రకానికి క్వింటాలుకు రూ. 2,203, రెండవ రకానికి రూ. 2,183 మద్దతు ధరను అందించనున్నారు.
వరి క్వింటాలుకు