జూబ్లీహిల్స్, డిసెంబర్ 2 : సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లకు సంఘం తరఫున గీతా గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అనురాధ, విజయలక్ష్మి, విజయగౌడ్, పద్మగౌడ్, దీపగౌడ్, సుజాతగౌడ్, మమతాగౌడ్, ఉమాపతిగౌడ్, రాజకుమారిగౌడ్, శైలజగౌడ్ పాల్గొన్నారు.