శ్రీరాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పనులు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టుల్లో తరగతులు
జూబ్లీహిల్స్,ఏప్రిల్4: శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణాన్ని ఇటీవల సమగ్రశిక్ష అధికారులు శరవేగంగా చేపడుతున్నారు. మూడేండ్ల క్రితం అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ నిర్మాణంతో విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా మా రాయి. పాఠశాల ప్రాంగణంలో రూ. కోటి 11 లక్షలతో జీ ప్లస్ 2 గా నిర్మించాల్సిన నూతన భవనం అర్థాంతరంగా ఆగిపోవడంతో తరగతి గదులు సరిపోక విద్యార్థులకు షిఫ్ట్ తరగతులు నిర్వహించేవారు. ఖైరతాబాద్ మండలంలో పెద్ద పాఠశాలల్లో ఒకటైన ఈ పాఠశాలలో ఈఏదాది 900 మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ఏ బ్లాక్లో ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న మరో 2 గదులతో పాటు నూతనంగా 12 అదనపు గదులు సిద్ధం కావడంతో పాఠశాలలో నెల కొన్న తరగతి గదుల సమస్య ఎట్టకేలకు తీర నున్నదని స మగ్రశిక్ష ఏఈ శ్రవణ్కుమార్ తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో తరగతి గదుల సమస్య ఏర్పడింది. కొంతకాలం తరగతుల నిర్వహణకు ఇబ్బందులు పడ్డాం. చివరికి ఉన్నతాధికారుల ఆమోదంతో షిప్ట్ తరగతులు నిర్వహిస్తున్నాం. అదనపు గదులు నిర్మించడంతో సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. సంతోషంగా ఉంది.
–రామలింగయ్య, హెచ్ఎం, డిప్యూటీ ఐవోఎస్