బేగంపేట్ జూన్ 8: రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, మత్య్స కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం మృగశిర కార్తె సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని తుఫ్రాన్కు చెందిన మత్స్య కారులు కొర్రమీను చేపను వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద అందజేశారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మత్స్య కా రులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలి పారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున మంత్రికి కొర్రమీను చేపలను అందిస్తున్నట్టు మత్స్యకారులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కోటేశ్వర్రావు, నరసింగ్రావు, సంపత్ తదితరులు ఉన్నారు.