బొల్లారం, మార్చి 6 : బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం గవర్నర్ తమిళిసై సౌదరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. ప్రదర్శనలు ఈనెల 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిలయం అధికారి రజినీ ప్రియ తెలిపారు.
ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెరిటేజ్ సారీ వాక్, లిటరరీ ఫెస్టివెల్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా మేజర్ జనరల్ రాకేశ్ మనోచా, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.అశోక్, నిలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.