గోల్నాక, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కరోనా కష్ట కాలంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. గురువారం అంబర్పేట ఏకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ..ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు బీవీ.మహేష్రాజు, రాము, బద్రినాథ్, వీరస్వామితో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.