కాచిగూడ,ఆగస్టు 1: పార్కుల సుందరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయలకు ఆతీతంగా నియోజకవర్గంలోని పార్క్లను అభివృద్ధి చేస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్పురలోని హౌజింగ్బోర్డు పార్క్లో సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, హార్టికల్చర్ అధికారులతో పర్యటించి పార్క్లోని సమస్యలను వాకర్స్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బర్కత్పుర హౌజింగ్బోర్డు కాలనీలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతర ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్క్ ద్వారం వద్ద ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని, పార్క్లోకి వాకింగ్కు వచ్చేవారికి ఇబ్బందులు తలేత్తకుండా వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా సందర్శకుల కోసం పార్క్ గోడలపై వినూత్నమైన చిత్రాల వేయించి, పార్క్ చుట్టుపక్కల మొక్కలు, పుట్పాత్లపై బెంచీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే తరాలకు పచ్చదనాన్ని ఇవ్వడానికి తమవంతు బాధ్యతగా స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఆయన సూచించారు.
హౌజింగ్బోర్డు పార్క్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్, టీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు, హార్టికల్చర్ అధికారులు, డాక్టర్ ఓం ప్రకాశ్యాదవ్,అధ్యక్షుడు ఎర్ర భీష్మా, ప్రధాన కార్యదర్శి కె.సదానంద్, దాత్రిక్ నాగేందర్బాబ్జి,బి.కృష్ణాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.