కందుకూరు : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి ఆద్వర్యంలో సేవాదల్ (గిరిజన ) సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మండలంలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించడానికి స్థలం కేటాయించి భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజనులు అన్ని విదాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో గిరిజనుల సమస్యలను గుర్తించి దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. సేవాలాల్ మందిరం నిర్మించడానికి కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్,మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, సేవాదల్ నాయకులు రాములు నాయక్, దేవీలాల్ నాయక్,మాణిక్యం నాయక్,రఘురాంనాయక్,క్రిష్ణనాయక్, దేవ్లా నాయక్,హటియ నాయక్, రూప్లనాయక్, రంజీనాయక్, వసంత్నాయక్,క్రిష్ణనాయక్, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.