మల్కాజిగిరి, అక్టోబర్ 26 : ఇంటింటి ప్రచారానికి మంచి స్పందని వస్తుందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి, మౌలాలి, నేరేడ్మెట్, అల్వాల్, మచ్చ బొల్లారం డివిజన్లలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న హామీలను తప్పకుండా అమలు పరుస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెల పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, మీనాఉపేందర్ రెడ్డి, సబితాకిశోర్, అనిల్కిశోర్, ఉపేందర్ రెడ్డి, అమీనుద్ధిన్, భాగ్యనందరావు తదితరులు పాల్గొన్నారు.