శంషాబాద్ రూరల్, ఆగస్టు 14: బ్యాగ్ జిప్ హోల్డర్లో దాచుకొని ఓ ప్రయాణికుడు విమానంలో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం.. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడు తన లగేజీ బ్యాగ్ జిప్ హోల్డర్లో దాచుకొని తీసుకొచ్చిన 246 గ్రాముల బంగారం బయటపడింది. ఆ బంగారం విలువ రూ.14.84 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.