హైదరాబాద్: హైదరాబాద్లోని కింగ్కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్రం చేస్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ బస్సు అదుపుతప్పి సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి సిబ్బంది వెంటేనే ఆమెను ఉస్మానియా దవాఖానకు తరలించారు.
అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.