సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారులకు సహకరించిన ప్రజలకు మేయర్ అభినందనలు తెలిపారు. కాగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెస్టివల్ను ఈ నెల 15న నాంపల్లి పబ్లిక్గార్డెన్లో నిర్వహించగా.. జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ గార్డెన్ నిర్వహణలో ఎల్బీనగర్ జోన్కు 14, కూకట్పల్లి జోన్కు 3, ఖైరతాబాద్ జోన్కి రెండు అవార్డులు లభించాయని తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత మేనేజర్లకు మొదటి బహుమతి గోల్డెన్ గార్డెన్ అవార్డు, ద్వితీయ బహుమతి సిల్వర్ గార్డెన్ అవార్డులను మేయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణ, ఖైరతాబాద్ జోన్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఎల్బీనగర్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.