సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : వేసవి కాలంలో చిన్నారుల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించడం, నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం జీహెచ్ఎంసీ ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నది. గత ఏడాది తరహాలో ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 30 వరకు సమ్మర్ కోచింగ్ కా్ంయపు-2023లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఔట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్తో పాటు పెయింటింగ్ తదితర మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్ గేమ్స్లలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. 6 నుంచి 16 సంవత్సరాల చిన్నారులు ఇందుకు అర్హులు. ప్రతి రోజూ ఉదయం 6:15 నుంచి 8:15 గంటల వరకు ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. 780 మంది ప్రత్యేక కోచ్లు, 44 రకాల ఆటలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నిర్వహణకుగాను జీహెచ్ఎంసీ దాదాపు రూ.1.42 కోట్లు ఖర్చు చేయనున్నది.