సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు… టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానికి బుల్కాపూర్ నాలా నుంచి రేతిబౌలి జంక్షన్ వరకు మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతం నుంచి ఆర్సీసీ బాక్స్ డ్రైయిన్స్ నిర్మాణ పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నాలాలో మురుగునీరు కలువకుండా ఉండేందుకు మిలిటరీ ఏరియా నుంచి ఏక్మీనార్ మసీద్ వరకు సివరేజీ పైపులైన్ నిర్మాణానికి నూతన పాలకవర్గం ఆమోదం తెలిపింది. సుమారు 1.7 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బుల్కాపూర్ నాలా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులతో మొదటి స్టాండింగ్ కమిటీ సమవేశం ఏర్పాటు చేసినందున వారిని ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అధికారుల సమక్షంలో చర్చ అనంతరం తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కార్పొరేటర్లు అధికారుల వద్ద ఎటువంటి సమాచారాన్ని అయినా నేరుగా తీసుకోవచ్చని మేయర్ తెలిపారు. వివాదం లేని ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించినటె్లైతే ప్రజా ప్రయోజనార్థం బస్తీ దవాఖానలు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు చేపడుతామని, సభ్యులు అలాంటి స్థలాలు గుర్తించి తెలియజేసిన పక్షంలో తగు చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం కూడా తగు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆర్.సునీత, రాగం నాగేందర్ యాదవ్, అబ్దుల్ వాహెబ్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, మహ్మద్ అబ్దుల్ ముక్తదర్, సయ్యద్ మిన్హా జుద్దీన్, సమీనా బేగం, ఈ.ఎస్.జితేంద్రనాథ్, టి.మహేశ్వరి, బండారి రాజ్కుమార్, వనం సంగీత యాదవ్, శాంతి సాయి జెన్ శేఖర్, మహమ్మద్ మాజీద్ హుస్సేన్, పండల సతీశ్బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, ఈఎన్సీ జియాఉద్దీన్, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు ప్రియాంక అలా, సంతోష్, ఈవీడీఎం విశ్వజిత్ కంపాటి, జయరాజ్ కెన్నెడి, జోనల్ కమిషనర్లు, మమత, రవికిరణ్, సామ్రాట్ అశోక్, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, శంకరయ్య, చీఫ్ వెటర్నరీ అబ్దుల్ వకీల్, చీఫ్ ఎంటరాలజిస్ట్ డా.రాంబాబు, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఈఈ మమత, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందిన ఎజెండా అంశాలు..