సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలతో రోజు వారీ టార్గెట్స్పై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి నిర్దేశిత లక్ష్యంలో రూ.1360 కోట్ల పన్ను వసూలు అయితే ఈసారి రూ. 1200కోట్లు మాత్రమే వసూలు చేశారు.
ఈ నేపథ్యంలో 30 సర్కిళ్లలో బకాయిదారులను చిట్టాను సిద్ధం చేసి వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. మొదటి విడతలో ప్రభుత్వ శాఖలకు లేఖలు రాయడం, పెద్ద మొత్తంలో బకాయి పడిన యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. 15 రోజుల్లోగా స్పందించని యాజమాని ఆస్తులను స్వాధీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.