సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ (సీఎస్ఆర్) కింద జీహెచ్ఎంసీలో జంక్షన్లు, పార్కులు మరింత అభివృద్ధి కానున్నాయి. ఇందుకోసం ముందుకొచ్చిన కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకునేందకు బల్దియా అనుమతిచ్చింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈమేరకు సీఎస్ఆర్ కింద మరిన్ని పార్కులను అభివృద్ధి చేసేందుకు కమిటీ సభ్యుల సహకారంతో 9 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు మేయర్ తెలిపారు.
స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్,పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, బాత జబీన్, ఇ.విజయ్ కుమార్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మందాడి శ్రీనివాసరావు, సామల హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ డీ.ఎస్. లోకేశ్ కుమార్, ఈవీడీఎం. డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ ప్రాజెక్ట్ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు శృతి ఓఝూ, బి.సంతోష్, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నడి, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ అశోక్, ఎస్ఎన్డీపీ సీఈ వసంత, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదం తెలిపిన పలు అంశాలు