హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
వీధి కుక్కల దాడుల నివారణపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జీహెచ్ఎంసీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వీధి కుక్కలు దాడులు చేస్తే తీసుకోవాల్సిన నివారణ, భద్రతా చర్యలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇవాళ మూసాపేట, గాజులరామారం, శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీధి కుక్కల దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. వీధి కుక్కల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాంస వ్యర్థాలను పడేస్తున్న మీట్ స్టాల్ ఓనర్స్పై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది.