సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : మహిళా సాధికారతతోనే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం యూఎస్ కాన్సులేట్, వీకనెక్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
మహిళా ఆంత్రప్రెన్యూర్లు, వ్యాపారవేత్తలతోపాటు వీకనెక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం లో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, వీకనెక్ట్ ఇంటర్నేషనల్ సీఈవో వాజిక్వీజ్తోపాటు పలువురు పాల్గొన్నారు.