బల్దియాలో భారీగా ఆస్తిపన్ను రాబడి
తొలి త్రైమాసికంలోనే రూ.935 కోట్లు రాక
లక్ష్యం రూ.1800 కోట్లు..
సగం మేర వసూళ్లు
కలిసొచ్చిన ఎరీబర్డ్ పథకం
సిటీబ్యూరో,జూలై 6 (నమస్తేతెలంగాణ) : మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో రికార్డుస్థాయి ఆస్తిపన్ను వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైన మూడు నెలల్లో (ఏప్రిల్, మే, జూన్) రూ.935.35 కోట్ల రాబడి సమకూరింది. ఈ ఏడాది లక్ష్యం రూ.1800 కోట్లు కాగా, మూడు నెలల్లో వసూళ్లు సగం దాటడం విశేషం.
2020లో రూ.682 కోట్లు, 2021లో రూ.620 కోట్లు రాగా, గత రెండేండ్లతో పోల్చితే ఈసారి రూ.300 కోట్లు అదనంగా వసూలయ్యాయి. ప్రధానంగా ఏప్రిల్ మాసంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ.741.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 9 నెలల సమయం ఉంది.