సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 74 కొలనులను సిద్ధం చేశారు. చెరువులు, కుంటలతో పాటుగా ప్రత్యేకంగా కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ సారి పుణే తరహాలో 24చోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంక్లను రెడీ చేశారు. పీవోపీ విగ్రహాల నిమజ్జనంలో ఈ ఏడాది ఈ పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
నూతనంగా ప్రిఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ ప్లాస్టిస్ (ఎస్ఆర్పి) 1.35 నుంచి 150 మీటర్ల లోతుతో 30×10 పొడవుతో పోర్టబుల్ వాటర్ ట్యాంక్లను 24 ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 22 ప్రదేశాలను గుర్తించి (డగ్ పాండ్) త్రవ్వకం జరిపి ఈ తాత్కాలిక కొలనులు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. హుస్సేన్సాగర్, చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకుండాఈ బేబీ పాండ్స్తో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోర్టబుల్ గణేశ్ నిమజ్జన కొలనులను గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు.
ఎల్బీనగర్ జోన్ (4): ఏఎస్రావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్, సచివాలయనగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్, ఏఆర్వో ఆఫీస్ హయత్నగర్, మున్సిపల్ ఆఫీస్ వెనుకాల ప్రభుత్వ కళాశాల
చార్మినార్ జోన్ (3): కృష్ణతులసి నగర్ పార్కు, రియాసత్నగర్ శివాలయగ్రౌండ్, లక్ష్మీ ఈశ్వర ప్లేగ్రౌండ్ జంగంమెట్
ఖైరతాబాద్ జోన్ (5): ఎస్బిఏ గార్డెన్ 100 ఫీట్ రోడ్డు, నిజాం కాలేజీ ప్లే గ్రౌండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, ఆమీర్పేట ప్లే గ్రౌండ్, ఎన్బీటీనగర్
శేరిలింగంపల్లి జోన్(3): ఐమ్యాక్స్ థియేటర్ వెనుక, పీజేఆర్ స్టేడియం చందానగర్, పటాన్చెరువు సాకి చెరువు
కూకట్పల్లి జోన్ (3): చిత్తరమ్మ టెంపుల్ వివేకానంద నగర్, హెచ్ఎంటీ ఓపెన్ ప్లేస్, కౌకూర్ పార్కు వాటర్ ట్యాంక్ దగ్గర
సికింద్రాబాద్ జోన్(4): ఆజాద్నగర్ అంబర్పేట స్టేడియంలో రెండు కొలనులు, ఎన్టీఆర్ స్టేడియంలో రెండు కొలనులు
28 శాశ్వత నిమజ్జన కొలనులు
ఎల్బీనగర్ జోన్(5): చర్లపల్లి, కాప్రా, నల్లచెరువు, నాగోల్, మన్సురాబాద్ పెద్ద చెరువు
చార్మినార్ జోన్(4): నర్సాబాయి కుంట, పాటికుంట, రాజన్న బావి, నెక్నాంపూర్
ఖైరతాబాద్ జోన్(1): నెక్లెస్రోడ్డు
శేరిలింగంపల్లి జోన్(8): దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్లగండ్ల చెరువు, గోపి చెరువు, గంగారం చెరువు, ఖైదమ్మకుంట, గురునాథం లేక్, రాయ సముద్రం లేక్
కూకట్పల్లి జోన్(7): ముళ్లకత్వ చెరువు, ఐడీఎల్, బాలాజీ నగర్ మూసాపేట, బోయిన్చెరువు, ప్రగతినగర్ అల్విన్ కాలనీ, హైదర్నగర్, లింగం చెరువు, కొత్త చెరువు, వెన్నెలగడ్డ లేక్
సికింద్రాబాద్ జోన్(3): సంజీవయ్యపార్కు, సఫిల్గూడ, బడా చెరువులు కలిపి మొత్తం ఆరు జోన్ల పరిధిలో 28 నిమజ్జన కొలనులు మరమ్మతులు చేసి నిమజ్జనానికి సిద్ధం చేశారు.
22 డగ్ పాండ్స్..
ఎల్బీనగర్ జోన్ (4): దేవేందర్ నగర్ రోడ్డు, వనస్థలిపురం స్విమ్మింగ్ఫూల్ పక్కన క్రికెట్ గ్రౌండ్, హుడా భారతీనగర్, సరూర్నగర్ ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్
చార్మినార్ జోన్(5): ఏకలవ్య గ్రౌండ్, గౌలిపుర బతుకమ్మ బావి, వైశాలినగర్ కమాన్ చంపాపేట మెయిన్ రోడ్డు, మైలార్దేవరపల్లి నర్సాబాయి కుంట, సాయి భవానీ ఎన్క్లేవ్.
ఖైరతాబాద్ జోన్(5): సర్కిల్ 12లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ 54, చింతల్బస్తీ రామ్లీలాగ్రౌండ్, అన్నపూర్ణ టెంపుల్ గుడి మల్కాపూర్, సర్కిల్ 17లో సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్కిల్ 18లో సక్కుబాయి లే అవుట్ షేక్పేట
కూకట్పల్లి జోన్(3): సర్కిల్ 25లో హెచ్ఎంటీ ఓపెన్ గ్రౌండ్, కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సర్కిల్ 26లో హెచ్ఎంటీ ఓపెన్ ప్లేస్ (ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన)
సికింద్రాబాద్ జోన్(3): 15వ సర్కిల్లో ఎన్టీఆర్ స్టేడియం, 16వ వార్డులో అంబర్పేట డంపింగ్ యార్డు, 29వ సర్కిల్ చిలకలగూడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు.