GHMC | హైదరాబాద్ : రికార్డు స్థాయిలో జీహెచ్ఎంసీ ( GHMC ) ఆస్తి పన్ను ( Income Tax ) వసూళ్లు అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్ల నిర్ధేశిత లక్ష్యం పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. మార్చి 31వ తేదీ రాత్రి 11 గంటల సమయానికి రూ. 1,681.72 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు అయినట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ ( Khairatabad Zone ) లో రూ. 435.57 కోట్లు వసూళ్లు కాగా, అత్యల్పంగా చార్మినార్ జోన్ ( Charminar Zone ) లో రూ. 122.86 కోట్లు వసూళ్లైంది. శేరిలింగంపల్లి జోన్ ( Sherilingampally Zone ) లో రూ. 348.60 కోట్లు, ఎల్బీ నగర్ జోన్ ( LB Nagar Zone ) లో రూ. 259.06 కోట్లు, కూకట్పల్లి జోన్ ( Kukatpally Zone ) లో రూ. 282.18 కోట్లు, సికింద్రాబాద్ జోన్ ( Secunderabad Zone ) లో రూ. 233.44 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లైంది.