ఈ ఏడాది టార్గెట్ రూ.107.93కోట్లు
ఇప్పటికే రూ.28.27 కోట్లు వసూళ్లు
ఆఫర్పై విస్తృతంగా అవగాహన
కేపీహెచ్బీ కాలనీ,ఏప్రిల్ 16: కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో ఆస్తిపన్ను చెల్లించినా రాయితీ వస్తుంది. ఈ ఆఫర్తో భవనాలు, వ్యాపార సముదాయాల యజమానులు ఆస్తిపన్ను చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్ల వారీగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సర్కిళ్ల వారీగా ఎర్లీబర్డ్ లక్ష్యా న్ని నిర్దేశించగా వందశాతం సాధించేందుకు రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇప్పటికే కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత సర్కిళ్ల వారీగా డీసీలు, రెవెన్యూ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తూ లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ఎర్లీబర్డ్ ఆఫర్పై విస్తృతంగా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గతేడాది ఆస్తిపన్ను చెల్లించని వారిని, చెల్లుబాటు కాని చెక్కులు ఇచ్చిన వారిని గుర్తిస్తూ వారిపై చట్టరీత్యా చర్యలకు సిద్ధ్దమవుతున్నారు.కూకట్పల్లి జోన్ పరిధిలో ఎర్లీబర్డ్ ఆఫర్ వసూళ్ల లక్ష్యం రూ.107.93 కోట్లుగా ఉన్నతాధికారులు నిర్దేశించగా ఇప్పటికే రూ.22.27 కోట్లు వసూళ్లయ్యాయి. మూసాపేట సర్కిల్లో రూ.40.09 కోట్ల లక్ష్యానికి గాను రూ.9.83 కోట్లు, కూకట్పల్లి సర్కిల్లో రూ.35.02 కోట్ల క్ష్యానికి గాను రూ.7.89 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో రూ.14.10 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.98 కోట్లు, గాజులరామారం సర్కిల్లో రూ.8.72 కోట్ల లక్ష్యానికి గాను రూ.2.25 కోట్లు, అల్వాల్ సర్కిల్లో రూ.10 కోట్లకు గాను రూ.4.30 కోట్లు వసూలు చేశారు.
ఆన్లైన్ చెల్లింపులోనూ రాయితీ వర్తింపు
ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగం గా ఆన్లైన్లో ఆస్తిపన్నును చెల్లించినా 5శాతం రాయితీ వస్తుంది. ఏప్రిల్ 30లోగా పన్ను చెల్లిస్తేనే రాయితీ వర్తి స్తుంది.జోన్ లక్ష్యాన్ని వందశాతం చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్కిళ్లు, డాకెట్ల వారీగా సమావేశాలు నిర్వహించి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించాం. గతం లో ఎర్లీబర్డ్లో పన్నులు చెల్లించిన వారికి ఎస్ఎంఎస్లు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాం. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలి. – వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి