హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు(Pending bills) చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు(GHMC contractors )ఆందోళన బాటపట్టారు. సోమవారం ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు చెల్లించలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.