హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC ) సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన తొలి సర్వసభ్య సమావేశం జరుగుతోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా వర్చువల్గా సమావేశం కొనసాగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సర పద్దును బల్దియా సర్వసభ్య సమావేశం ఆమోదించనుంది. రూ. 5,600 కోట్ల పద్దుకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలపనుంది.