హైకోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ, హౌసింగ్బోర్డు అధికారులు సం యుక్తంగా అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని ఎల్ఐజీ 123బ్లాక్లో జీహెచ్ఎంసీ, హౌసింగ్బోర్డు నిబంధనలను అతిక్రమిస్తూ ఇంటి పునఃనిర్మాణ పను లు కొనసాగుతున్నాయని… ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు యు.శివప్రసాద్ హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమాకోహ్లి, విజయసేనారెడ్డిలతో కూడిన ద్విసభ్య కమిటీ విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్నికి సంబంధించిన సమగ్ర వివరాలను నాలుగు వారాల్లో కోర్టుకు అందించాలని కోరా రు. హౌసింగ్బోర్డు వైస్ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యా యి.
ఈ నేపథ్యంలో మంగళవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర హౌసింగ్బోర్డు వైస్ చైర్మన్ సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీసీపీ దేవేందర్రెడ్డి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అక్రమ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణదారులను కలిసి అనుమతుల విషయంపై ఆరా తీశారు. అక్రమ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులు తీసుకున్న చర్యలేంటని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్, హౌసింగ్బోర్డు అధికారులను వివరాలు అడిగారు. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిర్మా ణ పనులను ఆపాలని నిర్మాణదారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను కోర్టు కు అందిస్తామని తదనంతరం చట్టపరంగా చర్యలుంటాయని వారు తెలిపారు. కార్యక్రమంలో మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, టౌన్ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, టీపీఎస్ రాజశ్రీ, హౌసింగ్బోర్డు చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్, వెస్ట్రన్ డివిజన్ ఈఈ కిరణ్బాబు, ఏఈవో వాసు తదితరులు ఉన్నారు.