ఘట్కేసర్ రూరల్, మార్చి 17 : మండల పరిధిలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లు చేపడుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘనపూర్లో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గతంలో పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ నుంచి పకీర్టెక్యా వరకు రూ. 35 లక్షల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతీ సభ్యులు పరమేశ్, శ్వేత, శోభ, పద్మ, పవన్ నాయక్, నాయకులు పాల్గొన్నారు. మర్పల్లిగూడ రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ మంగమ్మ, ఎంపీటీసీ సరళ, ఉప సర్పంచ్ నరేశ్, పంచాయతీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.