జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రజిని సాయిచంద్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.