కేపీహెచ్బీ కాలనీ /ఎల్బీనగర్/ సైదాబాద్/సుల్తాన్బజార్/సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి , ఆగస్టు 11 : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాసయాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై బుధవారం గ్రేటర్వ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. పార్టీ శ్రేణులు, యాదవ సంఘాలు, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి పటాకులు కాల్చారు. జేఎన్టీయూలో విద్యార్థి సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. జేఎన్టీయూహెచ్ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, టీటీఎస్ డబ్ల్యూఏ, బీబీఎస్ విద్యార్థి సంఘాల నేతలు భారీర్యాలీగా ప్రధాన ద్వారం వద్ద సంబురాలు నిర్వహించారు. జేఎన్టీయూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడికి సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త గుండుమల్ల పాండుగౌడ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజు అన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాసయాదవ్ను ప్రకటించటంపై అఖిలభారత యాదవ మ హాసభ గ్రేటర్ అధ్యక్షుడు మైల్కోలు మహేందర్యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఉద్యమ నాయకులకు న్యాయం జరుగుతున్నదన్నారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించి సీఎం కేసీఆర్కు బహుమతి ఇస్తామని చెప్పారు.
గెల్లు శ్రీనివాస్యాదవ్ పేరు ప్రకటనతో నిజాం కళాశాలలో టీఆర్ఎస్వీ నాయకుల సంబురాలు అంబరాన్నంటాయి. అనంతరం కళాశాల టీఆర్ఎస్వీ అధ్యక్షుడు నాగేందర్రావు ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గెల్లు శ్రీనివాస్యాదవ్ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంపై టీఆర్ఎస్ లీగల్సెల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన గెల్లుకు టికెట్ ఇచ్చినందుకు లీగల్సెల్ కన్వీనర్ గోవర్దన్రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టు జాయింట్ సెక్రటరీ జక్కుల లక్ష్మణ్, సభ్యులు ఇంద్రసేనారెడ్డి, అనిల్, కిరణ్, రవికుమార్, తిరుపతివర్మ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.