మాదాపూర్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతడి వద్ద రూ. 1.5 లక్షల విలువైన వాణిజ్య గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం … సూర్యాపేటకు చెందిన సందీప్కుమార్ (24) హోటళ్లు, హాస్టళ్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను దొంగలించి అమ్ముకునేవాడు. సాంకేతిక ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.