ఇద్దరు నిందితుల అరెస్ట్
13డీజీఎల్8 : పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి..
దుండిగల్, జూన్13: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. మల్లంపేట్లోని కత్వా చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దుండిగల్ పోలీసులు ఆదివారం రాత్రి 7 గంటలకు దాడులు నిర్వహించారు.
అక్కడే ఉన్న మల్లంపేట్ గ్రామానికి చెందిన రోహన్ కుమార్ సింగ్(30), ఇర్షద్ అహ్మద్ (23) అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద 30 చిన్న చిన్న ప్యాకెట్లలో ఉన్న 2కిలోల 857 గ్రాముల గంజాయి సంచి పట్టుబడింది. విచారణలో నిందితులు వైజాగ్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. పోలీసులు నిందితులిద్దరినీ రిమాండ్కు తరలించారు.