హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. దీంతో ప్రధాన మార్గాల్లో హుస్సేన్సాగర్ వైపు భారీసంఖ్యలో విగ్రహాలు బారులుతీరాయి. కాగా, హిమాయత్నగర్లో గణేశ్ విగ్రహం కూలిపోయింది. కర్మాన్ఘాట్లో టీకేఆర్ కాలేజీ వద్ద 20 అడుగుల గణేశ్ మట్టి విగ్రహం ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం ట్యాంక్బండ్కు తీసుకొస్తున్నారు. ఈక్రమంలో రాత్రి వర్షం కురువడంతో గణనాథుడు తడిసిపోయాడు. దీంతో హిమాయత్నగర్లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదుట గణేశ్ పడిపోయింది. దీంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.