హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలను వివరిస్తూ హైదరాబాద్లో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శనివారం నాడు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిల్పారామంలో జరిగిన ఈ ప్రదర్శనను ఎమ్మెల్సీ వాణీదేవి ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కాగా, గాంధీ జయంతి సందర్భంగా ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం ఇచ్చారు. ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని గాంధీజీ చూపించారని ఆయన కొనియాడారు. మానవాళిపై సత్యం, అహింస చెరగని ముద్ర వేశాయని, గాంధీజీ ఆలోచనలు ఆధునిక కాలానికి కూడా సరిపోతాయని చెప్పారు. గాంధీజీ బాటలోనే అందరూ ముందుకుసాగాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.