మహేశ్వరం : నాగిరెడ్డిపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నాయకులు ఆమె నివాసంలో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీసీ రోడ్లకు 10 లక్షలు, ఎస్టీ సబ్ప్లాన్ క్రింద 15లక్షలు గ్రామంలో ప్రమాదంగా ఉన్న 11 కెవీ విద్యుత్ను తొలగించేందుకు మంత్రి హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండూరి మనోహర్, ఎంపీటీసీ నడికూడి రమేష్ గ్రామశాఖ అధ్యక్షులు సిద్దులు ఉపసర్పంచ్ సురేందర్రెడ్డి వార్డు సభ్యులు కె. సిద్దులు, దీవెన, శివ, వర్మ, అమరేందర్, నవీన్ నాయకులు దేవుల, పాండు, జగన్, శ్రీను, విధ్యాకర్రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.