Hyderabad | సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటి సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు భారీ నీటి లీకేజీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9 శనివారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
18 గంటల పాటు జరిగే ఈ పనులతో పలు ప్రాంతాల్లో పాక్షికంగా , పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. విజయ్నగర్ కాలనీ, హుమాయున్ నగర్, కాకతీయ నగర్, అసెంబ్లీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.