మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు
మంత్రి చామకూర మల్లారెడ్డి
ఘట్కేసర్,ఏప్రిల్ 30 : మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. వైద్య శిబిరంలో దాదాపు 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులను అందజేశారు. 120 మందికి ప్రత్యేక పరీక్షల నిమిత్తం వచ్చే బుధవారం ప్రత్యేక బస్సులో మల్లారెడ్డి దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
రంజాన్ కానుకలు అందజేత..
రంజాన్ను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన కానుకలను ఘట్కేసర్ మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి ముస్లిం సోదరులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో దవాఖాన ట్రస్టు చైర్మన్ చామకూర భద్రారెడ్డి , ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, కౌన్సిలర్లు, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.రాధాక్రిష్ణ ముదిరాజ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, కమిషనర్ వసంత, డీటీ భాస్కర్ రెడ్డి, నాయకులు ఎం.జంగయ్య యాదవ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్, వైద్యులు, నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి : మంత్రి
పీర్జాదిగూడ, ఏప్రిల్ 30: సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 318 మంది మున్సిపల్ సిబ్బందికి ఎరియర్స్ వేతనాలు రూ. 81లక్షల 23వేల 536 చెక్కులను మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి..
శామీర్పేట : రంజాన్ సందర్భంగా అలియాబాద్ సీఎంఆర్ కన్వెన్షన్లో శనివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్పాష, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దీన్, జిల్లా మైనార్టీ ఇన్చార్జి అధికారి ఝాన్సీరాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, ఎంపీటీసీ సంఘం మండల అధ్యక్షుడు అశోక్రెడ్డి, ఎంపీటీసీలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.