హయత్నగర్, డిసెంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. ఆదివారం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాలను రంగారెడ్డి జిల్లా అడిషినల్ కలెక్టర్ ఎంవీ భూపాల్రెడ్డి, పలువురు కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, రాగుల వెంకటేశ్వర్రెడ్డి, దర్పల్లి రాజశేఖర్రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
మహేశ్వరం, డిసెంబర్ 10: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీచైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తెలిపారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు పేదలకు వరమని చెప్పారు. ఇటువంటి పథకాలు పేదలకు ఎంత మేలు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, ఎంపీపీలు సునీతా ఆంధ్యానాయక్, మంద జ్యోతి, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ఆర్డీవో సూరజ్ కుమార్, తాసీల్దార్ మహమూద్ అలీ, ఎంపీడీవో నర్సింహులు, తుక్కుగూడ కమిషనర్ వెంకట్రామ్, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు వరం మహాలక్ష్మి పథకం..
కందుకూరు, డిసెంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గంగుల శమంత ప్రభాకర్రెడ్డి తెలిపారు. నేదునూరు గ్రామంలో జీరో టికెట్ అందజేసిన అనంతరం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మైనార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ అఫ్జల్ బేగ్, నాయకులు గంగుల ప్రభాకర్రెడ్డి, బాలయ్య, బలవంత్రెడ్డి, పుణ్యమూర్తి, శ్రీశైలం, అమీన్ బేగ్, సురేశ్, మహిళలు పాల్గొన్నారు.