సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ): విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలను జలమండలిపైన పెట్టింది. ఇందుకు తగ్గట్లుగా నిధులు కేటాయిస్తోంది. ప్రస్తుత అవసరాలే కాకుండా రానున్న 40 ఏండ్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులు ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో, ఎండీ దాన కిశోర్ ఆధ్వర్యంలో జలమండలి ఈ ఏడాది కీలక ఘట్టాలకు నాంది పలికింది.
సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా..
ప్రపంచ వ్యాప్తంగా మహానగరాలు మంచినీటి కటకటను ఎదురొంటున్నాయి. రైళ్లలో నీటిని తరలించి ప్రజలకు సరఫరా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం తాగునీటి సమస్యలు లేకుండా చేయడంలో జలమండలి విజయవంతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వరకు తాగునీటి సరఫరా బాధ్యతను తీసుకున్న జలమండలి రోజు విడిచి రోజు నీటిని అందిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలో కొత్త జనావాసాలు ఏర్పడుతుండటం, జనాభా పెరుగుతుండటంతో తాగునీటి సరఫరాను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.1200 కోట్ల నిధులను కేటాయించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎకడా తాగునీటి సరఫరాకు సమస్యలు రాకుండా అవసరమైన చోట్ల జలమండలి కొత్త రిజర్వాయర్లను నిర్మించడంతో పాటు పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. రూ.1,450 కోట్లతో నాగార్జునసాగర్ వద్ద నిర్మించనున్న సుంకిశాల ఇంటేక్ వెల్ ద్వారా హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్యూఏ) ప్రాంతంలో తాగునీటికి భరోసా దకనుంది.
ముఖ్యమైన ఘట్టాలను పరిశీలిస్తే..
నగరంలో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాల్లో జలమండలి ప్రతీ రోజు 480 మిలియన్ గ్యాలన్ల తాగునీటి సరఫరాతో ఒక కోటి మంది నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. ప్రతీ రోజు గోదావరి 155 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్లు), కృష్ణా నది నుంచి 275 ఎంజీడీలు తరలించడంతో పాటు అవసరం మేరకు మంజీరా, సింగూరు నుంచి కూడా మంచినీటిని తరలించి నగరంతో ఓఆర్ఆర్ పరిధి వరకు సరఫరా చేస్తోంది.
ఎస్టీపీల నిర్వహణలో, గరిష్ఠ సామర్థ్యంతో మురుగుశుద్ధి చేయడంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. నగరంలోని చెరువులు, మూసీ నది శుద్ధి కావాలంటే నగరంలో ఉత్పత్తయ్యే
మురుగునీటిని 100 శాతం శుద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన . ఇందుకోసం నగరంలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణానికి జలమండలికి ప్రభుత్వం రూ.3,866.21 కోట్లను కేటాయించింది. ప్రస్తుతం 17 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే, జోన్ -3 పరిధిలోని కార్వాన్ నియోజక వ ర్గంలో రూ.300 కోట్ల వ్యయంతో సీవరేజి వ్యవస్థను ఆధునికీకరించి మురుగు సమస్యను పరిషరించడం జరిగింది. కాగా శివారు మున్సిపాలిటీల్లో సివరేజీ నిర్వహణ జలమండలి చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రికి సంబంధించిన మాస్టర్ప్లాన్ రచించడంలో జలమండలి భాగమైంది. యాదాద్రి ఆలయం పరిసరాలతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో సీవరేజి వ్యవస్థ ప్రణాళిక ఏర్పాటు బాధ్యతను కూడా ప్రభుత్వం జలమండలికి ఇచ్చింది. ఈ మేరకు జలమండలి డీపీఆర్ సిద్ధం చేస్తోంది.
జలమండలి ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జలమండలి
ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేసింది. హెల్త్ కార్డులను
అందించి ఆరోగ్యభద్రతను కల్పించింది.
నగర వాసులకు వరం.. ఉచితంగా 20 వేల లీటర్ల జలం
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత 20వేల లీటర్ల మంచినీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరమే ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ కనెక్షన్లు కలిగిన అందరు వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. జనవరి 12వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్, రహమత్నగర్లో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.