హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్లో (Dundigal) దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ ఉపాధి నిమిత్తం షోలాపూర్ నుంచి దుండిగల్ వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఆమెను గండిమైసమ్మలోని బార్ వెనక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లిన యువకులు.. సామూహికంగా లైంగిక దాడి చేశారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపించారు. నిందితులను దుండిగల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్తీకి చెందిన నరసింహ, ఇమామ్, కుద్దుస్, ఉమృద్దిన్గా గుర్తించారు. వాళ్లంతా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.