Shamshabad Airport | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : లండన్, మస్కట్, సింగపూర్ నుంచి చెన్నై వెళ్లాల్సిన నాలుగు విమానాలు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ నుంచి చెన్నైకి బయల్దేరిన బీఏ 035 నంబర్గల విమానం అక్కడ వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉదయం 8.58 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 10 54 నిమిషాలకు తిరిగి చెన్నైకి వెళ్లిన్నట్లు తెలిపారు. మస్కట్ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చిన డబ్ల్యూవై 251 నంబర్గల విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో 9.04 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. సింగపూర్ నుంచి చెన్నై వచ్చిన ఎస్క్యూ 524 విమానం వాతావరణం అనుకులంగా లేకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో 9.20 నిమిషాలకు ల్యాండింగ్ చేశారు. తిరిగి 11.08 నిమిషాలకు తిరిగి వెళ్లింది. దీంతో పాటు ముంబై నుంచి చెన్నై వచ్చిన ఏఐ 2821 నంబర్గల విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో 9.45 నిమిషాలకు ల్యాండింగ్ చేసి తిరిగి 11.24 నిమిషాలకు తిరిగి వెళ్లిన్నట్లు వివరించారు.