హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్కు ఓ విమానం చేరుకున్నది. అందులో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద సౌదీ రియల్స్ లభించాయని అధికారులు తెలిపారు.
వాటి విలువ రూ.63 లక్షలు ఉంటుందన్నారు. విదేశీ కరెన్సీని లగేజీ బ్యాగ్లోని ప్రత్యేక కంపార్ట్మెంట్లో ఉంచి తరలిస్తున్నాడని, ఆ నగదును సీజ్ చేశామని చెప్పారు. నిందుతుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఫెమా చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.