బంజారాహిల్స్ : టీఆర్ఎస్ జెండా పండగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా గులాబీ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వేలాది బైక్స్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. షేక్ పేటలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ర్యాలీని ప్రారంభించారు.
కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, రాజ్ కుమార్ పటేల్, దేదీప్య రావు, సీఎన్ రెడ్డి, వనం సంగీత యాదవ్తో పాటు వేలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలతో నియోజకవర్గంలో వీధులన్నీ మార్మోగాయి.