మొయినాబాద్, ఏప్రిల్ 20: చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం నిర్వహించాల్సిన ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు.
శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు తమ ఇండ్లలోనే చిలుకూరు బాలాజీని స్మరించుకోవాలన్నారు. సాయంత్రం కళ్యాణోత్సవం యథావిధిగా ఉంటుందన్నారు.